Friday, March 11, 2011

పతంజలి సార్ మిమ్మల్ని మేం మర్చిపోయి రెండేళ్ళైంది..


ఈ రోజు అక్షర శిల్పి, అక్షరకొరడాతో నిద్దరోతున్న సమాజాన్ని మేల్కొలిపేందుకు ఆఖరిశ్వాశ దాకా సాహితీప్రయాణం సాగించిన మనందరికి మిత్రుడు, శత్రువైన ఆధునిక భాష్యకారుడు పతంజలి గారి రెండవ వర్థంతి.. ఈ సందర్భంగా ఆయన గురించి ఎక్కువగా రాయలేని నా అజ్నానానికి సిగ్గుపడక ఆయన రాసిన ముక్కలలోంచే ఈ నాలుగుః

"ఆదియందు అక్షరముండెను. అది అబద్ధమై ఉండెను. అందువల్లనే అది అక్షయము, అక్షరము, అమరమూ అయివుండెను. అది పాలకుల వద్ద ఉండెను. ఆ అక్షరము నుంచి క్రమక్రమముగా అసత్య ప్రచారము పుట్టుకు వచ్చెను. అది ఏలిన వారి నాలుక చివరనె ఉండెను. ఏలినవారి అవసరార్థము వారి తాబేదారులు, మగధగణమూ, ఆ అసత్య ప్రచారమును రథములపై మోసుకుని తిరుగుచుండెను. ఏమీ అర్థం కాలేదా?"


ఐతే
పతంజలి భాష్యము, నాకు తప్పదు కదా? అధ్యాయము, పేజీ 127 చదువుడు..

1 comment:

  1. పతంజలి గారిని మర్చిపోవాలనే ఉంటుంది నాకు...లేకపోతే ఆయన సాహిత్యం కర్ర పట్టుకుని నా పక్కనే నిల్చుని నావి అల్పమైన రాతలు అని ఎత్తి చూపుతున్నట్లుగా ఉంటుంది నాకు...అందుకే.....

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...