Saturday, January 29, 2011

గోరఖ్ పాండే స్మృతిలో




















యువ కవీ

నీ గురించి తెలుసుకున్న క్షణం

నీ పోరాట రూపాన్ని తలుచుకున్న క్షణం

ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాను

విద్యాధికుడివైనా
శ్రామిక జన పక్షపాతిగా కలం పట్టి
కుళ్ళు రాజకీయ వ్యవస్థపై

అక్షర పోరాట బాణాలనెక్కుపెట్టి

జన సాంస్కృతిక మంచ్
స్థాపించి
హిందీ, భోజ్ పురిలలో
సాహిత్య సృజన చేసి
నిరంతరం జన విముక్తిని
కలలు గన్న
ఓ కవీ
రవీ విప్లవ కవీ
నీ కలలు నేటికీ సజీవం

నీ జ్ఞాపకాలు వెంటాడుతూనే వున్నాయి..


( ఈ రోజు గోరఖ్ పాండే ఆత్మహత్య చేసుకున్న రోజు. ఆయన తాను ఏర్పాటుచేసిన జన సాంస్కృతి మంచ్ తాను రూపొందిచిన ఆశయాలకనుగుణంగా ఎదగకపోవడం, సభ్యుల మధ్య సత్సంబంధాలు దూరం కావడంతో జనవరి 29,1989 న ఆత్మహత్య చేసుకున్నారు. పిన్నవయసులోనే మరణించిన ఈ కవి రెండు కవితా సంపుటాలు ప్రచురించారు. అలాగే వ్యవసాయ కూలీ పోరాటాలకు మద్ధతుగా పనిచేస్తూ రచనలు చేసారు. ఆయన జే.ఎన్.యు విద్యార్థి.A scholar of Sanskrit as well as a research scholar in philosophy, he did not let his academic background hamper his activity among the people.హిందీ కవితా రచనలలో ఓ కొత్త ఒరవడికి నాంది పలికిన గోరఖ్ పాండేకు జోహార్లర్పిద్దాం)

1 comment:

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...