Friday, January 7, 2011

డా.జ్నానానంద కవి మృతి

పద్మశ్రీ, కళాప్రపూర్ణ, డా.సురగాలి తిమోతి జ్నానానంద కవి నిన్న కాకినాడలో అనారోగ్యంతో తన 90వ ఏట మరణించారు. ఈయన విజయనగరం జిల్లా, బొబ్బిలి సమీపంలోని పెదపెంకి గ్రామంలో 1922, జూలై 16 న జన్మించారు. కాకినాడలోని మెక్లారిన్ హైస్కూల్ లో 35 సం.లపాటు తెలుగు పండితునిగా పనిచేసారు. 30 కి పైగా రచనలు చేసారు. బుద్ధుని శిష్యురాలైన ఆమ్రపాలి పై రాసిన కావ్యం పేరొందింది. అలాగే గోల్కొండ కావ్యం, క్రీస్తు చరిత్ర, తరంగమాల, వసంతగానం, గాంధీ, దేశబంధు, పాంచజన్యం, ప్రభంజనం, పర్జాన్యం, వెలుగుపాట, విజయాభిషేకం కావ్యాలు సాహితీ లోకాన్ని అలరింపచేసాయి. ఈ కావ్యాలలో చాలావరకు పాఠ్యాంశాలుగా చేర్చబడి ప్రశంశలందుకొన్నాయి. ఈ సాహితీపురుషుని నిష్క్రమణ తెలుగు సాహితీరంగాన్ని దుఃఖసాగరంలో ముంచింది..

2 comments:

  1. I'm shocked by the the bad news. His demise is a great loss to Telugu Literature.
    Birth year may be 1922 ... Pl. correct.

    ReplyDelete
  2. @డా.ఆచార్య ఫణీంద్ర Sir thanks for your concern on his demise and it's my typing mistake...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...