Monday, March 22, 2010

మరో మారు సిద్దార్థుడి హత్య

తాను రాజభవనం వీడి రాలేదు..
దుఃఖం ఎరుగక ఇల్లు వదలలేదు
అన్నార్తులు, అభాగ్యులు, విధివంచితులు,
పీడితులు, తాడితులు,
తనకు సుపరిచితులే..

తన చుట్టూ వున్న వాతావరణం
నిలబడనీయక,
కాలికింద మట్టి పెల్లగింపబట్టి
తన పయనాన్ని వేగవంతం చేయగా
జనం తలలో నాలుకలా
పొద్దుగుంకని, బడలికలేని తనంతో
నలుదిక్కులా సాగిందీ సూరీడి పయనం..

సామాజిక రుగ్మతల కార్యకారణ సంబంధాల
నిజరూపాన్ని అనేక బోధి వృక్షాల కింద
అధ్యయనం చేసి ఔపోసన పట్టి
నయా బుద్ధుడయ్యాడు!

నాటి సిద్దార్థుడు కత్తిని విడిచి
శిరోముండనం చేసుకొని విరాగికాగా
నేటి సిద్దార్థుడు చేత మరతుపాకీ పట్టి
పచ్చని చొక్కాలో పంటచేలమధ్య కలుపును
పెరికే పనిలో పడ్డాడు!

దుఃఖానికి మూలం కోరికలే కాదు
అపరిమిత స్వార్థంకూడా తోడయిన నాడు
ప్రవచనాల వల్లింపుతో ఏదీ సాధ్యపడదన్న
జ్ఞానోదయమై శత్రువు పక్కలో బల్లెమైనాడు

కుళ్ళి కృశించి నశించే కంటే
ఉల్కలా మారి బూడిదకావాలని ఆశించిన వాడు
నేలతల్లి విముక్తి పోరులో
మరోమారు సిద్ధార్థుడు హత్యకావింపబడ్డాడు..

(సురాజ్యాంగం ఉన్నా సుజనుల హత్యలు అన్న కన్నాభిరాన్ వ్యాసం (తే.21.3.10దీ ఆంధ్రజ్యోతి)చదివి..)

1 comment:

  1. Maoists damaged public property, killed many on the name of informers. They have no support of people, that's why they are hiding in jungles.

    I appreciate Police for their good effort.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...