
గత నలబై ఏళ్ళుగా తను రచించుకున్న ప్రణాళికకు నిబద్ధతతో కూడిన ఆచరణ ద్వారా, ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ పోరాట బావుటానందించేందుకు తన సాంస్కృతిక, సాహిత్య రంగం ద్వారా అవిరామ కృషి చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ విప్లవ రచయితల సంఘం ఝెండా తెలుగు నేలపై అదే స్ఫూర్తితో ఎగురుతున్నది. ఆది నుండి తనపై అమలు జరుగుతున్న తీవ్ర నిర్బంధాన్ని, నిషేధాన్ని తట్టుకొని ఉద్యమానికి బాసటగా ప్రజా సంఘంగా తనదైన కర్తవ్యాన్ని ముందు వరసలో ఆచరిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటూ, ప్రజలకు బాధ్యత వహిస్తూ నిలబడింది. భారత దేశ సామాజిక ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేస్తూ తన రచనల ద్వారా వాటిని మార్క్శిజం లెనినిజం మావో ఆలోచనా విధానం ద్వారా పరిష్కరించుకునే నేపథ్యంలో స్థానిక అస్థిత్వ పోరాటాలకు అండగా నిలుస్తూ పాలక వర్గాల దమన నీతిని ఎదుర్కొంటున్నది. తనపై విధించిన నిషేధాన్ని నిర్ద్వందంగా ఎదుర్కొంటూ ప్రజాస్వామిక మేధావుల ప్రజల అండదండలతో ప్రభుత్వాల నియంతృత్వ పోకడలను ఎండగట్టింది. అమరులైన చెరబండరాజు, సుబ్బారావు పాణిగ్రాహి, జ్నానేశ్వర్, కొ.కు., ఎన్నెస్ ప్రకాశరావు, శ్రీశ్రీ, తిరుపాల్, అబ్రహాం, ఈశ్వరి, సముద్రుడు, నూతన్, సహదేవరెడ్డి, ఎమ్మెస్సార్, కె.వి.ఆర్,ఐ.వి, పల్లెర్ల స్వామి, జనార్థన్, కౌముది లందించిన విప్లవ స్ఫూర్తిని నిత్యం రగిలిస్తూ భారతదేశ విముక్తి పోరాటాలకు అండగా నిలిచిన సంస్థకు ఆవిర్భావ దిన విప్లవ జేజేలు..
No comments:
Post a Comment
నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..