Showing posts with label ప్రకటన. Show all posts
Showing posts with label ప్రకటన. Show all posts

Tuesday, April 26, 2011

'కవిశ్వాశ' వారి ప్రకటనః

'కవిశ్వాశ' వారి ప్రకటనః

సాహితీ మిత్రుల సూచనతో విగ్రహ విధ్వంసంపై అటూ ఇటూ వారి స్పందనలతో కవిశ్వాశ, విజయవాడ వారు కవితాసంకలనం ఆవిష్కరణ తేదీని 'మే, 28' నాటికి మార్పు చేసి కవితలను పంపించవలసిన ఆఖరు తేదీని మే, 20 నాటికి మార్పు చేసారు.. మే, 28న ప్రముఖ సాహితీ ఉద్యమకారులు సురవరం ప్రతాపరెడ్డిగారి 115 వ జన్మదినం సందర్భంగా సంకలనావిష్కరణ జరుగుతుందని తెలియజేసారు. సురవరంవారు తెలంగాణా పోరాటానికి మద్ధతుగా 300 మంది కవులతో గోల్కొండ కవులు అన్న కవితా సంకలనం, ఆంధ్రుల సంస్కృతీ-చరిత్ర అన్న ప్రసిద్ధ గ్రంధాలు వెలువరించారు..
పై ప్రకటనను గమనించి సాహితీ మిత్రులు తమ కవితలను మే-20 నాటికి ఈ దిగువ చిరునామాకు పంపించ గోరుతున్నారుః
కె.ఆంజనేయకుమార్,
28-17-6,
రామమందిరం వీధి,
అరండల్ పేట,
విజయవాడ -520002 - సెల్ నెం. 8985358149 (శిఖా ఆకాష్)
మైల్ ఐడిః venneladaari@gmail.com

Saturday, April 16, 2011

విగ్రహ విధ్వంసంపై కవితలకాహ్వానం

విగ్రహ విధ్వంసంపై కవితా సంకలనం

హైదరాబాద్ టాంక్ బండ్ విగ్రహ విధ్వంసంపై వచ్చిన కవితలను సంకలనంగా తీసుకురావాలని 'కవిశ్వాశ' (Poetry circle), విజయవాడ నిశ్చయించింది. ఇరువైపులా వచ్చిన కవితలతో ఒకే వేదికపై విన్పించడానికి 'మేడే' రోజు ఉదయం ఆవిష్కరింపబడే ఈ సంకలనానికి కవితలను పంపించవలసిన ఆఖరు తేదీ April-25.

చిరునామాః
K.Anjaneyakumar,
Dr.No.28-17-6,
Ramamandiram Street,
Arandelpeta,
Vijayawada - 520 002..
Cell No.8985358149 (శిఖా ఆకాష్)

Monday, June 28, 2010

పొద్దులో నా కవితవచ్చిందోచ్..

చాన్నాళ్ళుగా పొద్దులో నా కవితను చూడాలని అనుకునేవాడిని. అందులో రాస్తున్న వారంతా సీనియర్స్ మరియు కవితల standard కూడా బాగుంటోంది. మన కవిత అందులో వస్తే బాగుణ్ణు అనుకునే వాడిని. ఇన్నాళ్ళకు అందులో చోటు దొరికింది. సాహితీ మిత్రులు స్పందించగలరు..

గాలి...http://poddu.net/?p=4823

Friday, January 8, 2010

'మీకు దగ్గరలోనే' కవితా స౦పుటికి అభ్యుదయ బహుమతి

కవి మిత్రుడు కె.ఆంజనేయకుమార్ కవితా సంపుటి 'మీకు దగ్గర్లోనే' కు కాకినాడ అభ్యుదయ ఫౌండేషన్ వారి ప్రథమ బహుమతి వచ్చింది. ఈ బహుమతి ప్రథానోత్సవం కాకినాడలోని సూర్య కళామందిర్ లో ఈ ఆదివారం (10-1-2010) కలదు. అదేరోజు ఉదయం 9 గం.లకు శ్రీశ్రీ శత జయంతి సభతో కార్యక్రమాలు మొదలవుతాయి. కవిసమ్మేళనం అనంతరం కవితా సంపుటి, కథా సంపుటాలకు బహుమతి ప్రథానాలు జరుగుతాయి. ఈ సాహితీ విందుకు ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు అద్దేపల్లి రామ్మోహనరావు, కవి భగ్వాన్, మేడపల్లి రవికుమార్ తదితర ప్రముఖులు హాజరవుతున్నారు. సాహిత్యాభిమానులు హాజరయి విజయవంతం చేయాలని కోరుతు..
Related Posts Plugin for WordPress, Blogger...